యాప్నగరం

వియ్యానికెళ్లి కయ్యానికి దిగిన పేరెంట్స్.. మనస్థాపంతో ప్రేమజంట..

రాజమండ్రికి చెందని యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఆ విషయం ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పించారు. అయితే ఇరుకుటుంబాలు కూర్చుని మాట్లాడుకునే సమయంలో వివాదం రేగింది.

Samayam Telugu 24 May 2020, 3:58 pm
వయసులో ఉన్న యువతీ, యువకులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు పద్ధతిగా పెద్దలకు చెప్పారు. ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లలు ఇష్టపడ్డారు కదా అని ఒప్పుకున్న పెద్దలు పెళ్లి మాటలు మాట్లాడుకునేందుకు ఓ చోట కూర్చున్నారు. అందులో మాటామాటా పెరిగి చివరికి గొడవకు దారితీసింది. ఆ విషయం తెలిసిన ప్రేమికులు పెళ్లి జరగదేమోనన్న భయంతో ఆత్మహత్యా యత్నం చేశారు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


రాజమహేంద్రవరంలోని సిమెంట్రీపేటకు చెందిన శిరీష, ధవళేశ్వరానికి రాజు కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చి విషయం ఇళ్లలో చెప్పి ఎలాగో ఒప్పించారు. పెళ్లి మాటలు మాట్లాడుకునేందుకు శిరీష కుటుంబ సభ్యులు రాజు ఇంటికి వెళ్లారు. మాటల సందర్భంలో ఇరుకుటుంబాల మధ్య మాటామాటా పెరిగి వివాదానికి దారితీసింది.

Also Read: పదేళ్ల బాలికను పొలాల్లోకి లాక్కెళ్లి.. దారుణం

ఇద్దరూ గొడవపడ్డారని తెలియడంతో తమ పెళ్లి జరగదన్న మనస్థాపంతో శిరీష చేయి మణికట్టుపై కోసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. ఆ విషయం తెలుసుకున్న ప్రియుడు రాజు ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగేశాడు. యువతి రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. రాజుని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read Also: సొంత అక్కతో ఆ సంబంధం.! తమ్ముడిని చంపేసిన బావ.. ప్రకాశంలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.