యాప్నగరం

ప్రేమజంట ఆత్మహత్య.. విశాఖలో విషాదం

ప్రేమికుల మధ్య తలెత్తిన గొడవ రెండు ప్రాణాలు బలితీసుకుంది. మనస్థాపంతో ప్రియురాలు.. ఆమె ఇక లేదని ప్రియుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఏపీలో చోటుచేసుకుంది.

Samayam Telugu 12 Feb 2020, 10:39 pm
విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. క్షణికావేశంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ గొడవపడ్డారు. ఆ వివాదం చినికిచినికి గాలివానగా మారడంతో మనస్థాపానికి గురైన ప్రియురాలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ప్రియుడు కూడా నీవు లేనిదే నేనే లేనంటూ సూసైడ్ చేసుకున్న ఘటన తీవ్రవిషాదం నింపింది.
Samayam Telugu love couple


విశాఖలోని గోపాలపట్నంలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న మక్కా శిరీష, కంచరపాలేనికి చెందిన వెంకట్ కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఇద్దరూ గొడవ పడ్డారు. వివాదం తీవ్రం కావడంతో మనస్థాపానికి గురైన శిరీష ఇంట్లో పై అంతస్తులోని గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. మెడకు ఉరి బిగించుకుని ఆత్మహత్య చేసుకుంది.

Also Read: కన్నకూతురిపై కన్నేసిన తండ్రి.. ఖమ్మం జిల్లాలో దారుణం

శిరీష ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న వెంకట్.. ప్రియురాలు లేని జీవితం వ్యర్థమంటూ కంచరపాలెంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్ మార్చురికీ తరలించారు. ప్రేమికుల జంట ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Read Also: తిండి లేకుండా ఎన్ని రోజులు.? గూగుల్‌లో సెర్చ్ చేసి మరీ.. విశాఖ చిన్నారి విషాదాంతంలో షాకింగ్ నిజాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.