యాప్నగరం

చావులోనైనా కలిసుండాలని.. జగిత్యాల జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో చావులోనైనా కలిసుండాలనుకుని ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.

Samayam Telugu 8 Jul 2020, 11:46 am
జగిత్యాల జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. కోరుట్ల మండలం ఇబ్రహీంపట్నానికి చెందిన గుండేటి రమ్య (22), మండలోజి ప్రణీత్‌చారి(22) రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి కులం వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అడ్డు చెప్పారు. దీనికి తోడు రమ్యకు ఇటీవలే మరొక యువకుడితో తల్లిదండ్రలు వివాహం నిశ్చయించారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను ప్రణీత్‌నే పెళ్లి చేసుకుంటానని రమ్య చెప్పినా కుటుంబసభ్యులు వినిపించుకోలేదు.
Samayam Telugu రమ్య, ప్రణీత్‌చారి(ఫైల్ ఫోటోలు)


Also Read: మూడు నెలల గర్భిణి ఆత్మహత్య.. కారణం తెలీక కుటుంబసభ్యుల షాక్

దీంతో కలిసి బ్రతకలేకపోతున్న తాము... కలిసైనా చావాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున ప్రేమికులిద్దరూ ఇంటి నుంచి పారిపోయి గ్రామ శివారులో పురుగులమందు తాగారు. అనంతరం ఇద్దరూ కలిసి చెట్టుకు ఉరేసుకున్నారు. అయితే తాడు తెగడంతో రమ్య కింద పడిపోగా.. ప్రణీత్‌చారి అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో భయపడిన ఆమె వెంటనే తన తండ్రి లక్ష్మణ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని రమ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. ఇరుకుటుంబాల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: 14ఏళ్ల వయసులోనే ఇద్దరిపై బాలుడి అఘాయిత్యం.. షాకైన గ్రామస్థులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.