యాప్నగరం

ప్రియుడితో కలసి నవవధువు ఆత్మహత్య.! వికారాబాద్‌లో కలకలం

చేవెళ్లకి చెందిన యువతీ యువకులు ప్రేమించుకున్నారు. ప్రియురాలి కుటుంబ సభ్యులు ఆమెకి మరొకరితో వివాహం జరిపించారు. పెళ్లైన నెలరోజులకే విషాదం జరిగింది.

Samayam Telugu 17 Jun 2020, 2:08 pm
వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నెలరోజుల కిందట వివాహమైన యువతి ప్రియుడితో కలసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన కటికె మీనా(19) అదే గ్రామానికి చెందిన సార కార్తీక్(20) ప్రేమించుకున్నారు. అయితే ప్రేమించిన వాడిని కాదని ఆమెకి వేరొకరితో పెళ్లి నిశ్చయించారు.
Samayam Telugu ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట
love couple suicide


గత నెలలో శంషాబాద్ మండలం మంచిరేవులకి చెందిన అబ్బాయితో మీనా వివాహం జరిపించారు. ప్రేమించిన వ్యక్తితో కలసి బతకలేక ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నవాబుపేట మండలం పూలపల్లి గ్రామ పరిధిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

Also Read: మరదలిపై మోజుపడిన బావ.. అక్కని చంపేసి.. కర్నూలులో దారుణం

ప్రేమించిన వ్యక్తితో కలిసి బతకలేక.. విడిచి ఉండలేక ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇష్టం లేని పెళ్లి కారణంగానే ప్రేమ జంట ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.