యాప్నగరం

ఇంట్లో తెలిసిన ప్రేమ వ్యవహారం.. భయంతో ప్రేమజంట.!

టీనేజ్ లవ్‌స్టోరీ విషాదాంతమైంది. ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిపోయిందని భయపడిన జంట ప్రాణాలు తీసుకుంది. వికారాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 5 Nov 2020, 9:28 am
తమ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిపోవడంతో భయాందోళనకు గురైన ప్రేమజంట అఘాయిత్యం చేసుకుంది. పురుగులమందు తాగి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ అత్యంత విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. తాండూర్ మండలం మల్‌రెడ్డిపల్లికి చెందిన బాలరాజ్(22) అదే గ్రామానికి చెందిన టీనేజ్ యువతి(16) కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆ విషయం ఇద్దరి ఇళ్లలో తెలిసిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులకు భయపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పురుగుల మందు తాగి ఇద్దరూ ఆత్మహత్యాయత్నం చేశారు. యువతి అక్కడికక్కడే మృతి చెందగా.. బాలరాజ్‌ని హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. యువతీయువకుల మరణంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Samayam Telugu ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట
vikarabad suicide


Also Read: హైదరాబాద్‌లో కీచకుడు.. మహిళను గర్భవతిని చేసి, నగ్నచిత్రాలతో బ్లాక్‌మెయిల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.