యాప్నగరం

ప్రేమజంట పరార్.. యువకుడి ఇంటికి నిప్పు పెట్టిన యువతి కుటుంబం

పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ప్రేమజంట పారిపోయింది. దీంతో ఆగ్రహించిన యువతి బంధువులు యువకుడి ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు.

Samayam Telugu 15 Jun 2020, 10:53 am
ఓ జంట ప్రేమ గ్రామంలో తీవ్ర అలజడికి దారితీసిన ఘటన తమిళనాడులో జరిగింది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న ఆందోళనతో ప్రేమజంట పారిపోగా.. ఆగ్రహించిన యువతి కుటుంబసభ్యులు ప్రియుడి ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. వేలూర్‌ జిల్లా జోలార్‌పేట సమీప మండలవాడి కామరాజపురానికి చెందిన తిరుపతి అనే యువకుడు, చిన్న మండలవాడికి చెందిన ఓ యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారువ్యతిరేకించారు. దీంతో శుక్రవారం ఈ ప్రేమ జంట పారిపోయింది.
Samayam Telugu Image


Also Read: ‘నా లవర్‌ది సూసైడ్ కాదు... పరువు హత్య’ పోలీసులకు యువకుడి ఫిర్యాదు

దీంతో ఆగ్రహించిన యువతి కుటుంబసభ్యులు, బంధువులు సుమారు 50 మందికి కలిసి శనివారం యువకుడి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి వస్తువులన్ని చిందరవందర చేసి నిప్పు పెట్టారు. వారిని అడ్డుకున్న ముగ్గురు స్థానికులపైనా దాడి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వాణియంబాడి ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.లక్ష నగదు, 20 సవర్ల బంగారు నగలు, విలువైన వస్తువులు అగ్నికి ఆహుతైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 20 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Also Read: ముంబయి యువతులతో హైదరాబాద్‌లో వ్యభిచారం.. ఐదుగురి అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.