యాప్నగరం

రైలు పట్టాలపై పడుకున్న కడప ప్రేమజంట.. పోలీసులను చూసి

పెద్దలను ఎదిరించి బతికడం కష్టమని భావించి చనిపోవాలను నిర్ణయించుకున్నారు. శనివారం ఎర్రముక్కపల్లె సమీపంలోని రైల్వేగేటు వంతెన వైపు వెళ్లి రైలు పట్టాలపై పడుకున్నారు.

Samayam Telugu 25 Nov 2019, 10:58 am
రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోతున్న ప్రేమజంటను బ్లూకోల్ట్స్‌ పోలీసులు కాపాడిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన నాగేంద్ర (24) ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భవతి. కొద్దిరోజుల తర్వాత యువతిని ఆమె తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లిపోయారు. దీనికితోడు తమ కుమార్తెను నాగేంద్ర కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని కిడ్నాప్‌ కేసు పెట్టారు.
Samayam Telugu రలదలూల


Also Read: ఆ హోటల్‌లో 40మంది సెక్స్‌వర్కర్లు.. వేశ్యలనే సిబ్బందిగా పెట్టుకుని వ్యభిచారం

ఈ క్రమంలో వారిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేశారు. పెద్దలను ఎదిరించి బతికడం కష్టమని భావించి చనిపోవాలను నిర్ణయించుకున్నారు. శనివారం ఎర్రముక్కపల్లె సమీపంలోని రైల్వేగేటు వంతెన వైపు వెళ్లి రైలు పట్టాలపై పడుకున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న బ్లూకోల్ట్స్‌ హెడ్‌కానిస్టేబుల్‌ రమణమూర్తి, హోంగార్డు ప్రసాద్‌కు స్థానికులు విషయం చెప్పారు. దీంతో వారు రైలు పట్టాల మీదకు వెళ్లగా ఆ జంట పోలీసులను చూసి పారిపోయింది.

Also Read: ప్రియుడితో బెడ్రూమ్‌‌లో భార్య రొమాన్స్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన భర్త

పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని వివరాలు కనుక్కోగా అసలు విషయం చెప్పారు. వారిని తమతో తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోవైపు యువతి వయస్సు 16ఏళ్లు మాత్రమేనని తెలుస్తోంది. దీనిపై కడప వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: అప్పులు తీర్చడానికి భార్య శీలాన్ని తాకట్టు పెట్టిన భర్త

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.