యాప్నగరం

ఖరీదైన ఫోన్ అవసరమా? అని నిలదీసిన భార్యను కొట్టిచంపిన భర్త

ఖరీదైన సెల్‌ఫోన్ కొన్నందుకు వ్యతిరేకించిన భార్యను ఓ వ్యక్తి దారుణంగా కొట్టి చంపేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు కొత్త ఫోన్ ఎందుకు అని అడిగినందుకు చావగొట్టి ప్రాణం తీశాడు.

Samayam Telugu 21 Oct 2019, 3:53 pm
ఖరీదైన సెల్‌ఫోన్ కొన్నందుకు మందలించిన భార్యను కిరాతకంగా చంపేశాడో దుర్మార్గుడు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనె జిల్లా డామ్‌వాడా గ్రామానికి చెందిన భోలారం అనే వ్యక్తి, భార్య నందుబాయి, ముగ్గురు పిల్లలున్నారు. పేద కుటుంబం కావడంతో ఏ రోజు కూలీ ఆరోజే కుటుంబ పోషణకు సరిపోతోంది.
Samayam Telugu murder


Also Read: భార్యపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి పురుషాంగం కోసేశాడు

ఈ నేపథ్యంలోనే భోలారం మూడ్రోజుల క్రితం ఖరీదైన సెల్‌ఫోన్ కొని ఇంటికి తెచ్చాడు. అది చూసిన భార్య ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న సమయంలో సెల్‌ఫోన్ అవసరమా? అని భర్తను మందలించింది. ఇదే విషయమై దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో భోలారం ఆగ్రహంతో నందుబాయిని కర్రతో తలపై తీవ్రంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే కూలిపోవడంతో పరారయ్యాడు.

Also Read: అక్రమ సంబంధం ఎఫెక్ట్.. మహిళను నగ్నంగా వీధుల్లో ఊరేగించిన గ్రామస్థులు

నందుబాయి ముగ్గురు పిల్లలు ఇంట్లో నుంచి ఏడుస్తూ బయటకు వచ్చి విషయాన్ని స్థానికులకు చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. రక్తపు మడుగులో పడివున్న నందుబాయిని చూసిన చుట్టపక్కల వాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. భోలారంపై హత్య కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నారు.

Also Read: హైటెక్‌సిటీలో హైటెక్ వ్యభిచారం.. పోలీసులు అదుపులో మోడల్స్, విదేశీ యువతులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.