యాప్నగరం

పోలీసుల నిర్లక్ష్యం.. అత్యాచార బాధితురాలి బలవన్మరణం!

పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై కుమిలిపోయిన మైనర్ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్గోనే జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక మరణించిన తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Samayam Telugu 23 Dec 2019, 10:01 am
తనపై అత్యాచారం జరిగిందని మైనర్ బాలిక ఫిర్యాదు చేయగా పోలీసులు స్వీకరించలేదు. పైగా బాలికపైనే అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై కుమిలిపోయిన ఆ బాలిక తన జీవితాన్నే బలితీసుకుంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్గోనే జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా అదనపు ఎస్పీ శశికాంత్‌ తెలిపిన వివరాల మేరకు.. డిసెంబర్‌ 16న మహేశ్వర్‌ గ్రామానికి చెందిన బాలిక (16) కర్గోనే జిల్లా కేంద్రం నుంచి తన స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో సుఖ్‌రాం బుందేలా అనే వ్యక్తి బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది.
Samayam Telugu rape1


Also Read: మతిస్థిమితం లేని వివాహిత, మైనర్ బాలికలపై రేప్..

అనంతరం శుక్రవారం రాత్రి బాధితురాలు ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె శనివారం మరణించింది. అనంతరం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి ఏఎస్పీ చెప్పారు.

పోలీసుల దుర్మార్గ వైఖరి..
బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. తన కూతురిపై జరిగిన అఘాయిత్యం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్లగా, కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. మూడు సార్లు స్టేషన్‌కు వెళ్లినా పోలీసులు కేసు తీసుకోకపోగా తన కూతురిపైనే అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కుమిలిపోయాన తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని వాపోయారు. ఈ ఆరోపణలపై జిల్లా ఎస్పీ ఎస్‌కే పాండే మాట్లాడుతూ.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు.

Also Read: బలవంతంగా మద్యం తాగించి.. కార్మికురాలిపై అత్యాచారం..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.