యాప్నగరం

అతనికి కరోనా నెగెటివ్.. కానీ ఛీత్కారాలు ఎదుర్కోలేక సూసైడ్.. విషాద ఘటన వెలుగులోకి..

కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకుని వచ్చేసరికే ఆ విషయం దావానలంలా వ్యాపించింది. మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి బలవన్మనరణానికి పాల్పడిన విషాద ఘటన వెలుగుచూసింది.

Samayam Telugu 3 Apr 2020, 2:53 pm
కరోనా మహమమ్మారి సోకిందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. కరోనా లక్షణాలు ఉన్నాయంటూ అతనిని అధికారులు ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో కొందరు అత్యుత్సాహవంతులు సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. తనకు కరోనా వచ్చిందంటూ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు చూసి మనస్ధాపానికి గురైన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
Samayam Telugu death


మదురై జిల్లాకు చెందిన వ్యక్తి(35) కేరళలో కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో తల్లిని చూసేందుకు స్వగ్రామానికి వచ్చాడు. అయితే అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో స్థానికులు, ఇరుగుపొరుగు అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన అధికారులు సదరు వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంబులెన్సు రాకపోవడంతో స్థానికులే వాహనాన్ని ఏర్పాటు చేయించి మరీ ఆస్పత్రికి పంపారు. ఆ సమయంలో కొందరు అత్యుత్సాహంతో అతని వీడియోలు తీశారు.

Also Read: కరోనా కల్లోలం.. ప్రియురాలిని కాల్చేసి ప్రియుడి ఆత్మహత్య.. కారణమదే.!

అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. అయితే ఆయన శాంపిల్స్ తీసుకున్న ఆస్పత్రి సిబ్బంది వెంటనే ఇంటికి పంపడంతో ఇరుగుపొరుగు ప్రజలు దుర్భాషలాడడంతో మనస్థాపానికి గురయ్యాడు. తనకు కరోనా సోకిందంటూ సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ కావడంతో కుంగిపోయిన ఆయన.. అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆత్మహత్య చేసుకుని ఈ లోకం విడిచి వెళ్లిపోయాడు.

Read Also: లాక్‌డౌన్‌: యువతిపై ఆర్మీ జవాన్ ఫైరింగ్.. స్పాట్‌లోనే..

మదురై జిల్లా కప్పలూరు వద్ద రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే అతనికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా నెగెటివ్‌‌ అని వచ్చింది. అది తెలిసేలోపే సోషల్ మీడియాలో కొందరి అత్యుత్సాహం, చుట్టుపక్కల ఉండే ప్రజల ఛీత్కారాల కారణంగా ఓ నిండు ప్రాణం గాల్లో కలసిపోయింది.

Also Read: కామంతో బరితెగించిన జంట.. కారులోనే రెచ్చిపోయి సెక్స్ చేస్తూ..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.