యాప్నగరం

‘నా భర్త సంసారానికి పనికిరాడు... హనీమూన్‌కి తీసుకెళ్లి ఏమీ చేయలేదు’

సెక్స్ చేసే సమయంలో తన భర్త వింతగా ప్రవర్తించడాన్ని ఆమె గమనించింది. అతడు పురుషాంగంతో కాకుండా సెక్స్ టాయ్‌తో ఆమెను తృప్తి పరిచేందుకు ప్రయత్నించాడు.

Samayam Telugu 6 Dec 2019, 3:58 pm
మహారాష్ట్రలోని పంప్రి చించ్వాడ్ పోలీసులకు ఇటీవల ఓ విచిత్రమైన కేసు వచ్చింది. కొత్తగా పెళ్లి చేసుకున్న మహిళ ఇచ్చిన ఫిర్యాదుకు ఎలా స్పందించాలో తెలియక పోలీసులు తలలు పెట్టుకున్నారు. చివరికి న్యాయ నిపుణుల సలహాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu woman2


Also Read: ‘దిశ’కు న్యాయం జరిగింది.. కామాంధులకు కనువిప్పు కావాలి: పవన్‌కళ్యాణ్

మహారాష్ట్రలోని భోసరి పట్టణానికి చెందిన మహిళ(28) కొద్దిరోజుల క్రితం వివాహమైంది. అనంతరం కొత్త దంపతులిద్దరూ హనీమూన్‌కి వెళ్లారు. అయితే సెక్స్ చేసే సమయంలో తన భర్త వింతగా ప్రవర్తించడాన్ని ఆమె గమనించింది. అతడు పురుషాంగంతో కాకుండా సెక్స్ టాయ్‌తో ఆమెను తృప్తి పరిచేందుకు ప్రయత్నించాడు. తనతో సెక్స్ చేయాలని ఆమె భర్తను ఎంతగా కోరినా అతడు మాత్రం ససేమిరా అన్నాడు. దీంతో హనీమూన్‌ను అర్ధంతరంగా ముగించుకుని అత్తారింటికి వచ్చేసింది.

Also Read: ‘నా భర్తను ఎన్‌కౌంటర్ చేసిన చోటే నన్నూ చంపేయండి’.. చెన్నకేశవులు భార్య

భర్త తనతో ప్రవర్తించిన తీరును వారికి వివరించి నిలదీసింది. ఈ క్రమంలో తన భర్తకు సెక్స్‌కు పనికిరాడను తెలుసుకుని షాకైంది. వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్త, అత్తమామలు, ఆడపడుచుపై ఫిర్యాదు చేసింది. తన భర్తకు మగతనం లేదన్న విషయాన్ని దాచిపెట్టి తన జీవితాన్ని నాశనం చేశారని, వారిపై కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది. భర్త తనతో నేరుగా సెక్స్ చేయకుండా సెక్స్ టాయ్స్ వినియోగిస్తున్నాడని, అందుకు నిరాకరిస్తే మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడని పేర్కొంది. అతడితో కలిసి బతకడం తనకిష్టం లేదని, పెళ్లి సమయంలో తాము కట్నంగా ఇచ్చి రూ.5లక్షల నగదు తిరిగి ఇప్పించాలని మహిళ పోలీసులను కోరింది. దీంతో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: యాధృచ్ఛికం... ‘దిశ’ దశదిన కర్మ రోజే నిందితుల ఎన్‌కౌంటర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.