మహారాష్ట్ర రాజధాని ముంబయి మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదంతో ఉలిక్కిపడింది. నవీ ముంబయిలోని ఉరాన్ ప్రాంతలో గల ఓఎన్జీసీ ప్లాంట్ కోల్ట్ స్టోరేజీలో భారీ పేలుడు సంభవించడంతో అగ్నికీలకు ఎగసిపడ్డాయి.
ప్రమాదం జరిగిన వెంటనే సైరన్ మోగడంతో అన్ని విభాగాలు అప్రమత్తమయ్యాయి. భద్రతా సిబ్బంది ప్లాంట్లో ఉన్న అందరినీ వెంటనే బయటకు పంపేశారు. హుటాహుటిన 50 ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఓఎన్జీసీ అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది.
Also Read: పెళ్లికి నో చెప్పిందని వేశ్యను ముక్కలుగా నరికి చంపాడు