యాప్నగరం

బైక్‌తో సహా బావిలో పడిన వ్యక్తి.. రెండ్రోజులు నరకయాతన

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన పరికెల రాజమౌళి గురువారం సాయంత్రం హన్మకొండలోని తన బంధువుల ఇంటికి బైక్‌పై వచ్చాడు. రాత్రి అక్కడే బస చేసిన ఆయన శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఇంటికి బయలుదేరాడు.

Samayam Telugu 2 Jun 2019, 10:52 am
బైక్ అదుపుతప్పి బావిలో పడిపోయిన వ్యక్తి రెండ్రోజుల పాటు నరకయాతన అనుభవించాండు. అతడి కేకలు విన్న ఓ రైతు స్థానికుల సాయంతో అతడిని రక్షించి ప్రాణాలతో బయటకు తీశాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu pjimage (7)


కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన పరికెల రాజమొగిలి గురువారం సాయంత్రం హన్మకొండలోని తన బంధువుల ఇంటికి బైక్‌పై వచ్చాడు. రాత్రి అక్కడే బస చేసిన ఆయన శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఇంటికి బయలుదేరాడు. నాగారం క్రాస్ రోడ్ వద్ద బైక్ అదుపుతప్పి సమీపంలోని 75 అడుగుల లోతున్న బావిలో పడిపోయాడు. చీకటిలో జరిగిన ప్రమాదానికి అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కాసేపటి తర్వాత తేరుకున్నాక గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది.

శనివారం ఉదయం స్థానిక పొలాల వద్దకు వెళ్తున్న రైతుకు రాజమొగిలి కేకలు వినపడటంతో బావి వద్దకు వెళ్లి చూశాడు. ఈ విషయాన్ని స్థానికులకు చేరవేసి తాళ్ల సాయంతో బాధితుడిని బయటకు తీశాడు. బతుకుజీవుగా అంటూ ప్రాణాలతో బయటపడిన రాజమౌళి తనను రక్షించినవారికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడిని పరామర్శించి అతడి కుటుంసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు గ్రామానికి చేరుకుని స్థానికులకు కృతజ్ఞతలు చెప్పి రాజమొగిలిని ఇంటికి తీసుకెళ్లారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.