యాప్నగరం

తండ్రీకొడుకుల కిరాతకం.. తోడబుట్టిన తమ్ముడి సహా ఇద్దరి దారుణ హత్య

పూర్వీకులు ఇచ్చిన భూమిని పంచుకున్న అన్నదమ్ములకు నడిచే దారి విషయమై వివాదాలు జరుగుతున్నాయి. తమ్ముడిపై కోపం పెంచుకున్న అన్న అతన్ని దారుణంగా హత్య చేశాడు.

Samayam Telugu 5 May 2020, 10:29 pm
పొలం బాట వివాదం రెండు నిండు ప్రాణాలు బలితీసుకుంది. ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడినే అంతమొందించాడు అన్న. అడ్డొచ్చిన అతని బావమరిదిని కూడా పొడిచేశాడు. కొడుకు సాయంతో కిరాతకంగా ఇద్దరినీ చంపేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని విలుప్పురం జిల్లాలో చోటుచేసుకుంది. గింజీ పరిధిలోని తచ్చంపట్టు గ్రామానికి చెందిన ముత్తుక్రిష్ణన్ (50), ఏలుమలై (48) అన్నదమ్ములు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


గత కొద్దికాలంగా ఇద్దరి మధ్య ఆస్తి వివాదం నడుస్తోంది. పూర్వీకుల నుంచి సంక్రమించిన 59 సెంట్ల భూమిని ఇద్దరూ సమంగా పంచుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. పొలం దారి విషయంలో తరచూ వివాదాలు జరుగుతున్నాయి. ఆ దారిని తమ్ముడు ఏలుమలై, అతని బావమరిది మురుగన్ (45) రాకపోకలకు వినియోగిస్తుండడంపై ముత్తుక్రిష్ణన్ అభ్యంతరం చెప్పాడు.

Also Read: ప్రియుడి మోజులో మహిళ నీచం.. కన్నకూతురికి నిద్రమాత్రలిచ్చి..

మరోమారు అన్నదమ్ముల మధ్య వివాదం రేగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అన్న ముత్తుక్రిష్ణన్ అతని కొడుకు తంగమణి(20)తో కలసి తమ్ముడు ఏలుమలైని కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. అడ్డొచ్చిన తమ్ముడి బావమరిది మురుగన్‌ని కూడా పొడిచేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. పొలం బాట వద్ద తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానగా మారి ఇద్దరి హత్యకు దారితీసింది. పోలీసులు కేసు నమోదు చేసి తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు.

Read Also: కూతురిపై కన్నేసిన కీచకుడు.. రోజూ సెక్స్ వీడియోలు చూపించి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.