యాప్నగరం

కన్నతండ్రి కాదు కీచకుడు.. బెదిరించి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి

భార్య ఇంట్లో లేని సమయంలో ఇద్దరు కూతుళ్లను బెదిరించిన మురళి వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని ఆవడిలో జరిగింది.

Samayam Telugu 20 Jul 2020, 12:33 pm
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న కూతుళ్లపైనే ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన తమిళనాడులోని వెలుగుచూసింది. ఆవడి సమీపంలోని తిరునిండ్రవూరుకు చెందిన మురళి(36) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మొదటి భార్య చనిపోవడంతో కొన్నాళ్ల క్రితం మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యతో కలిసిన కూతురు(13), రెండో భార్య కూతురు(13) కూడా వారితోనే కలిసి ఉంటున్నారు.
Samayam Telugu Image


Also Read: కట్నం వేధింపుల మరో మహిళ బలి.. అత్తింట్లోనే ఉరేసుకున్న వివాహిత

మురళి రెండో భార్య కేటరింగ్ పనులకు వెళ్తుంటుంది. ఈ క్రమంలోనే బాలికలపై కన్నేసిన మురళి భార్య లేని సమయంలో ఇద్దరినీ బెదిరించి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని బాలికలు ఇటీవల తల్లికి చెప్పడంతో ఆమె ఆవడి మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మురళిపై గతంలో తిరువళ్లూరు మహిళా పోలీసుస్టేషన్‌లో లైంగిక దాడి కేసులు, తండయారుపేట పోలీసుస్టేషన్‌లో జంట హత్యల కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. తిరునిండ్రవూరు పోలీసులు అతడిపై రౌడీషీట్ కూడా తెరిచారు.

Also Read: స్నేహితుల సాయంతో యువతిని ఎత్తుకెళ్లి రేప్.. నెల్లూరు జిల్లాలో ఘోరం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.