యాప్నగరం

ప్రియురాలి కోసం దొంగగా మారి.. పనిచేస్తున్న సంస్థ నుంచే రూ.8లక్షల దోపిడీ

ప్రియురాలికి వైద్యం చేయించి పెళ్లి చేసుకునేందుకు అచ్చిరెడ్డి తాను పనిచేసే సంస్థ నుంచి రూ.8లక్షల నగదు కొట్టేశారు. పోలీసుల విచారణలో అతడు నేరం అంగీకరించాడు.

Samayam Telugu 28 May 2020, 10:01 am
ప్రియురాలి కోసం పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. ఆమెకు వైద్యం చేయించేందుకు నగదు కాజేసి దొంగలు దోచుకున్నారని నాటకమాడాడు. అతడి ప్రవర్తనపై అనుమానమొచ్చిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా ఇంటి దొంగ దొరికేశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన మారం అచ్చిరెడ్డి(28) అనే వ్యక్తి తెలంగాణలోని కోదాడ కాపుగల్లులో ఉండే బంధువు తిరుపతిరెడ్డికి చెందిన సంస్థలో పనికి కుదిరాడు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. కొద్దిరోజుల క్రితం అతడి ప్రియురాలు అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెకు వైద్యం చేయించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం సంస్థ సొమ్మునే కాజేయాలనుకున్నాడు.
Samayam Telugu Image


Also Read: తాళి కట్టిన మూడోరోజే వరుడి పరార్.. ప్రేమ వ్యవహారంపై అనుమానాలు

మే 25న కలెక్షన్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చిన అచ్చిరెడ్డి బాలానగర్‌లోని ఓ ఏజెంట్‌ వద్ద రూ.8,76,500 వసూలు చేసి వేరే ప్రాంతంలో పొదల్లో దాచిపెట్టాడు. దుండగులు తనను కొట్టి నగదు దోచుకెళ్లారని యజమానికి ఫోన్ చేసి చెప్పగా.. అతడు మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో పోలీసులు అచ్చిరెడ్డినే అనుమానించి విచారించగా అతడు నేరాన్ని అంగీకరించాడు. అతడు పొదల్లో దాచిన డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Also Read: కాపురంలో సెల్‌ఫోన్ చిచ్చు.. భర్తతో గొడవపడి భార్య ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.