యాప్నగరం

అత్తింటి ఆస్తిపై ఆశతో.. బావమరిదిని బండరాయితో కొట్టి చంపిన బావ

బావమరిదిని చంపేస్తే అత్తింటి వారి ఆస్తి తనకే దక్కుతుందన్న ఆశతో మణికంఠన్‌ అతడిని దారుణంగా చంపేశాడు. అయితే పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో రెండ్రోజుల్లోనే కటకటాలపాలయ్యాడు.

Samayam Telugu 22 Jan 2020, 3:19 pm
అత్తింటి వారి ఆస్తి కొట్టేసేందుకు ఒక్కగానొక్క బావమరిదిని దారుణంగా చంపేశాడో కిరాతకుడు. వారసుడు లేకపోతే ఆ ఆస్తి తనకు దక్కుతుందన్న అత్యాశతో హంతకుడిగా మారాడు. తమిళనాడులోని సేలం జిల్లా మల్లూర్‌ ప్రాంతానికి చెందిన పళమియప్పన్‌కు ఇద్దరు కుమార్తెలు ఈశ్వరి, శశికళ, కుమారుడు వెంకటేశన్ ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు కాగా.. వెంకటేశన్ స్థానిక పాఠశాలలో ప్లస్‌టూ చదువుతున్నాడు.
Samayam Telugu tamilnadu


Also Read: విశాఖలో దారుణం.. అక్కాచెల్లెళ్లను లొంగదీసుకుని రేప్ చేసిన బాలురు

పళమియప్పన్‌ చిన్నకుమార్తె భర్త మణికంఠన్ చేనేత కార్మికుడితో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతూ ఉండటంతో అప్పులపాలయ్యాడు. దీంతో అత్తింటి వారి ఆస్తిపై అతడి కన్నుపడింది. తన బావమరిది వెంకటేశన్‌ అడ్డు తొలగించుకుంటే ఆస్తి తనకు దక్కుతుందని, దీంతో దర్జాగా బతికేయొచ్చని భావించాడు. శనివారం బావమరిదికి ఫోన్ చేసిన మణికంఠన్ మద్యం తాగుదామంటూ పిలిచాడు. అతడితో పాటు తన స్నేహితుడు గౌరీశంకర్‌ను కారులో తీసుకెళ్లాడు.

Also Read: ఒంగోలులో మహిళపై గ్యాంగ్ రేప్?.. రోడ్డుపక్కన నగ్నంగా బాధితురాలు

వీరు ముగ్గురు రాత్రి సమయంలో ఓ చెరువు వద్దకు వెళ్లి ఫుల్లుగా మద్యం తాగించారు. మణికంఠన్ పథకం ప్రకారం వెంకటేశన్‌తో అతిగా మద్యం తాగించాడు. దీంతో అతడు మత్తులోకి జారుకున్నాడు. అదే అదనుగా భావించిన మణికంఠన్ బండరాయితో వెంకటేశన్‌ తలపై కొట్టి చంపేశాడు. ఆదివారం ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాల్స్‌డేటా ఆధారంగా మణికంఠన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో నిందితులను మంగళవారం కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Also Read: పచ్చని సంసారాన్ని చిదిమేసిన విధి.. భర్త, కుమార్తె మృతితో అనాథగా మారిన మహిళ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.