యాప్నగరం

తన భార్యతో అఫైర్ పెట్టుకున్నాడని.. పక్కింటి వ్యక్తిని కత్తితో నరికేశాడు

పక్కింట్లో ఉండే వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో రసూల్ కత్తితో పొడిచాడు. బాధితుడు పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

Samayam Telugu 31 May 2020, 8:35 am
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ వ్యక్తిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గుంటూరు జిల్లాకు చెందిన సత్యనారాయణరెడ్డి రెడ్డి ల్యాబ్‌లో పనిచేస్తూ.. మిర్యాలగూడలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. మరోవైపు పెయింటింగ్‌ పని చేసుకునే రసూల్‌.. తన కుటుంబంతో సత్యనారాయణరెడ్డి పక్క ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లడంతో సత్యనారాయణరెడ్డి ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో సత్యనారాయణరెడ్డి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానం రసూల్‌లో కలిగింది.
Samayam Telugu Image


Also Read: వ్యభిచారం చేసే బాలికతో రాసలీలలు.. నెల్లూరు జిల్లాలో ఎస్ఐ నిర్వాకం

దీంతో రసూల్‌ ఈ నెల 27న మిర్యాలగూడ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసలు విచారణ కోసం సత్యనారాయణరెడ్డిని స్టేషన్‌కు పిలిచారు. దీంతో అతడు శనివారం పీఎస్‌కు వెళ్తుండగా రసూల్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడికి దిగారు. ప్రాణాలు కాపాడుకునేందుకు సత్యనారాయణరెడ్డి పోలీసుస్టేషన్‌లోకి పరుగెత్తాడు. అతడి చేతికి బలమైన గాయం కావడంతో పోలీసులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: నిశ్చితార్థం కాగానే బావతో హద్దులు దాటిన యువతి.. తండ్రి మందలింపుతో

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.