యాప్నగరం

జంటను కత్తిపీటతో నరికిన యువకుడు.. తూర్పుగోదావరిలో దారుణం

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన యువకుడు భార్యాభర్తలను కత్తిపీటతో నరికేశాడు. భర్త మెడపై నరకడంతో తీవ్రగాయాలయ్యాయి. భార్య సమీప బంధువే దాడి చేసినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 19 Nov 2020, 10:37 am
తూర్పు గోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువజంటను సమీప బంధువు కత్తిపీటతో నరికేశాడు. భర్తకి తీవ్రగాయాలు కాగా.. అడ్డొచ్చిన భార్య కూడా ఆస్పత్రి పాలైంది. ఈ ఘటన వై.రామవరం మండలం పియర్‌కొండలో జరిగింది. గ్రామానికి చెందిన జె.ధర్మారెడ్డి(25), అతని భార్య చంద్ర(22)పై అదే గ్రామానికి చెందిన ముర్ల రాజారావు పగ పెంచుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన రాజారావు కత్తిపీటతో ధర్మారెడ్డి మెడపై నరికాడు. అప్రమత్తమైన భార్య చంద్ర అడ్డురావడంతో ఆమెను కూడా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder attempt


గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు భార్యాభర్తలను వెంటనే వై.రామవరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ధర్మారెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కి తరలించారు. దాడి చేసిన రాజారావు సమీప బంధువుగా తెలుస్తోంది. భార్య చంద్రకి సోదరుడు వరుస అవుతాడని సమాచారం. పాతకక్షల నేపధ్యంలోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:
టీచర్ మర్డర్ కేసులో దొరకని క్లూ.. భార్య ఫోన్ కాల్ లిస్ట్‌తో షాకింగ్ ట్విస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.