యాప్నగరం

యువకుడిని కత్తితో పొడిచి.. కృష్ణా జిల్లాలో దారుణం

యువకుడిని కత్తితో పొడిచిన దారుణ ఘటన జరిగింది. పాతగొడవలను మనసులో పెట్టుకుని కత్తితో దాడి చేయడంతో అలెగ్జాండర్ అనే యువకుడు తీవ్రగాయాలపాలయ్యాడు. పరిస్థితి విషమంగా ఉంది.

Samayam Telugu 5 May 2020, 2:50 pm
పాతకక్షల నేపథ్యంలో ఓ యువకుడిని ప్రత్యర్థి కత్తితో పొడి చేసిన దారుణంగా ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. నందిగామ నియోజకవర్గ పరిధిలో ఈ ఘటన జరిగింది. చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామానికి చెందిన పాలపర్తి అలెగ్జాండర్‌(30)ని అదే గ్రామానికి చెందిన నండ్రూ విజయ్ కుమార్ అనే వ్యక్తి కత్తితో దారుణంగా పొడిచేశాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ఇద్దరి మధ్య వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. పాతకక్షల నేపథ్యంలోనే అలెగ్జాండర్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో అలెగ్జాండర్‌కి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆంధ్ర హాస్పిటల్‌ కి తీసుకెళ్లారు. పాతగొడవల కారణంగానే దాడి జరిగినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: గర్భిణిని తుపాకీతో కాల్చేసిన భర్త.. పొదల్లో దాక్కున్న కొడుకు బయటికొచ్చి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.