యాప్నగరం

ముగ్గురు పిల్లలు పుట్టాక భార్య నల్లగా ఉందట! గుంటూరులో భర్త ఘాతుకం

గుంటూరులో దారుణ ఘటన జరిగింది. ఐదేళ్లు కాపురం చేసి ఇప్పుడు భార్య నల్లగా ఉందని, విడాకులు కావాలంటూ వేధించడం మొదలుపెట్టాడు.

Samayam Telugu 20 Oct 2020, 10:18 am
కట్టుకున్న భార్యను వదిలించుకోవాలన్న ఉద్దేశంతో భర్త నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. ముగ్గురు పిల్లలు పుట్టాక నల్లగా ఉన్నావంటూ సూటిపోటి మాటలతో హింసించడం మొదలుపెట్టాడు. చివరికి ఆమెను అంతమొందించేందుకు ప్రయత్నించడంతో దిక్కుతోచని స్థితిలో వివాహిత పోలీసులను ఆశ్రయించింది. తనకు భర్త నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంది. ఈ దారుణ ఘటన గుంటూరులో వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
harassment


వట్టిచెరుకూరు మండలానికి చెందిన మహిళకు 2015లో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు సంతానం. కొద్దికాలం నుంచి భర్త తనకు విడాకులివ్వాలంటూ భార్యని వేధించడం మొదలుపెట్టాడు. నల్లగా ఉందని నిందిస్తూ కాపురం చేయనని సూటిపోటి మాటలతో హింసించేవాడు. అంతటితో ఆగని కసాయి భర్త విడాకులివ్వకుంటే చంపేస్తామంటూ కిరోసిన్ డబ్బాతో బెదిరించడంతో ఆమె భయపడి రోడ్డుపైకి పరుగులు పెట్టింది. భర్త వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అర్బన్ ఎస్పీని కలసి తన గోడు వెళ్లబోసుకుని కన్నీటిపర్యంతమైంది. స్పందించిన ఎస్పీ ఆమె సమస్యను పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

Also Read: ఆ ఒక్కమాటే శాపం.! చెల్లెలిపై అత్యాచారం, నలుగురిని నరికి దారుణ హత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.