యాప్నగరం

భార్య గొంతుకోసి దారుణం.. కడపలో కసాయి భర్త కిరాతకం

కసాయి భర్త కిరాతకానికి తెగబడ్డాడు. కట్టుకున్న భార్యపై హత్యాయత్నం చేశాడు. మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 26 Nov 2020, 12:23 pm
కట్టుకున్న భార్య గొంతుకోశాడో కసాయి భర్త. అనంతరం తాను కూడా గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన కడప జిల్లాలో జరిగింది. పుల్లంపేట మండలం వత్తలూరు పంచాయతీ పరిధిలోని వడ్డిపల్లెకి చెందిన శ్రీను(30), మంగమ్మ(24) భార్యాభర్తలు. సాయంత్రం వేళ మద్యం మత్తులో ఇంటికొచ్చిన శ్రీను భార్యతో గొడవపడి దారుణానికి తెగబడ్డాడు. కత్తితో కిరాతకంగా ఆమె గొంతుకోశాడు. అదే కత్తితో తాను గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder attempt


తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడుతుండడంతో ఇరుగుపొరుగు కూడా గొడవ విషయం గమనించలేదు. ఇళ్లకే పరిమితమయ్యారు. కొద్దిసేపటి అనంతరం గొంతు నుంచి రక్తం కారుతున్న మంగమ్మను స్థానికులు గమనించి వెంటనే 108 అంబులెన్సుకు సమాచారఅం అందించారు. గ్రామానికి చేరుకున్న వైద్య సిబ్బంది భార్యాభర్తలను అంబులెన్సులో రాజంపేట ఆస్పత్రికి తరలించారు. హత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read:
Medico: పెళ్లైన నెలకే గర్భం దాల్చిందని.! హిందూపురంలో ఘోరం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.