యాప్నగరం

chittoor: ప్రియురాలికి పెళ్లై మూడు రోజులు.. తట్టుకోలేని ప్రియుడు.!

ప్రేమించిన యువతికి పెళ్లైపోవడంతో తట్టుకోలేని యువకుడు తీవ్రమనస్థాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. మదనపల్లెలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 31 Oct 2020, 10:29 am
ప్రాణంగా ప్రేమించిన యువతికి మరో యువకుడితో పెళ్లైపోయింది. అదే తలచుకుంటూ బాధపడుతున్న ప్రియుడు మానసికంగా కుంగిపోయాడు. తీవ్ర మనస్థాపంతో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. పట్టణ శివారులోని చంద్రాకాలనీకి చెందిన సలీం కుమారుడు కరీముల్లా(21) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కొద్దకాలంగా ఓ యువతిని ప్రేమించాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide attempt


ఆమెకు మూడురోజుల కిందట మరో యువకుడితో వివాహం జరిగింది. ప్రియురాలు తనకు దక్కలేదన్న బాధతో కుంగిపోయి కరీముల్లా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చేయికోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు గమనించి యువకుడిని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఔట్‌పోస్టు పోలీసుల సమాచారం మేరకు పోలీసులు విచారిస్తున్నారు.

Also Read: చున్నీతో ఫ్యానుకి వేలాడిన కొడుకు.. అత్త అనుమానంతో కోడలు బాగోతం వెలుగులోకి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.