యాప్నగరం

కూతురికి న్యాయం జరగలేదని తండ్రి.. కాకినాడలో విషాద ఘటన

పదేళ్ల కూతురిపై ముగ్గురు యువకులు అత్యాచార యత్నం చేశారని తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. తమకు న్యాయం జరగడం లేదంటూ అఘాయిత్యం చేసుకున్నాడు.

Samayam Telugu 3 Oct 2020, 4:59 pm
కాకినాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. కూతురికి న్యాయం జరగడం లేదంటూ ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. రాజమహేంద్రవరానికి చెందిన అహ్మద్(పేరు మార్చాం) తన పదేళ్ల కూతురిని ముగ్గురు యువకులు రేప్ చేసేందుకు యత్నించారంటూ పోలీసులను ఆశ్రయించాడు. అత్యాచారయత్నం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide attempt


అయితే పోలీస్ స్టేషన్‌లో ఎలాంటి న్యాయం జరగకపోగా నిందితులు తమను వేధింపులకు గరిచేస్తున్నారని అహ్మద్ మనస్థాపానికి గురయ్యాడు. ముగ్గురు నిందితులతో పాటు మరికొందరు తన భార్యను, తనను వేధిస్తున్నారన్న ఆవేదనతో ఆత్మహత్యా యత్నం చేశాడు. పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రాజమహేంద్రవరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో కాకినాడ జీజీహెచ్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: చెల్లెలికి భోజనం పెట్టించి, బట్టలు కొనిపించి.. చంపేసిన అక్క! షాకింగ్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.