యాప్నగరం

పెళ్లైన పది రోజులకే దూరమైన భార్య.. మనస్థాపంతో భర్త.. చిత్తూరులో విషాదం

కులాంతర వివాహం చేసుకున్న ప్రేమజంటని పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లారు. అక్కడ ప్రియుడు, అతని కుటుంబ సభ్యులను బెదిరించి అమ్మాయిని తీసుకెళ్లిపోయినట్లు వాపోయాడు.

Samayam Telugu 24 Sep 2020, 11:53 am
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని పోలీసులు దూరం చేశారని మనస్థాపానికి గురై భర్త ఆత్మహత్యాయత్నం చేసిన విషాద ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. కేవీపల్లె మండలంలోని ఎంవీ పల్లె పంచాయతీ ఎగువమేకలవారిపల్లెకి చెందిన దళిత యువకుడు నాగభూషణ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తిరుపతిలో చదువుకుంటున్న సమయంలో కడప జిల్లా రైల్వే కోడూరు మండలం వెంకటరెడ్డిపల్లెకి చెందిన సుకన్యా రెడ్డితో పరిచయమై ప్రేమగా మారింది. ఇద్దరూ కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide attempt


వేర్వేరు కులాలు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించరని భావించిన ప్రేమజంట ఈ నెల 14న చీనేపల్లె ఆలయంలో వివాహ బంధంతో ఒక్కటైంది. అయితే తమ కూతురు కనిపించడం లేదంటూ సుకన్యా రెడ్డి తల్లిదండ్రులు కోడూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రియుడి స్వగ్రామం ఎగువమేకలవారిపల్లెకి చేరుకున్నారు. నవ దంపతులతో పాటు వరుడి తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు.

Also Read: వైసీపీ ఎమ్మెల్యే ఇంటి వద్ద తుపాకీతో అనుమానితులు.. కడపలో కలకలం

మేజర్ అయిన సుకన్యా రెడ్డి తాను నాగభూషణతోనే ఉంటానని లిఖితపూర్వకంగా తెలియజేసినా పట్టించుకోని పోలీసులు వరుడు, అతని తల్లిదండ్రులను బెదిరించి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నాగభూషణ చీనెపల్లె చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన గ్రామస్తులు అతన్ని కాపాడి బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న కేవీ పల్లె పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చ తల్లిదండ్రులకు అప్పజెప్పారు.

Read Also: భర్తని బూడిద చేసి చెరువులో కలిపేసిన భార్య.. ప్రియుడితో కలసి ఘాతుకం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.