యాప్నగరం

అల్లుడి దారుణ హత్య.. కూతురుతో కలసి అత్త ఘాతుకం

పనికి వెళ్లడం లేదంటూ రమేష్‌తో భార్య గొడవపడుతుండేది. ఏదో పని చేయాలంటూ సాధించేది. చివరికి తల్లితో కలసి దారుణంగా చంపేసింది.

Samayam Telugu 31 May 2020, 9:03 pm
లాక్‌డౌన్‌లో డబ్బులు సంపాదించడం లేదంటూ భర్తని భార్య, ఆమె తల్లి కొట్టి చంపేసిన దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఖండ్వా పరిధిలోని ఖర్కలా గ్రామానికి చెందిన రమేష్(38) లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యాడు. పనుల్లేక పోవడంతో సంపాదన కరువైంది. ఇదే విషయమై రమేష్ భార్య లీల రోజూ భర్తతో గొడవపడేది. ఏదో ఒక పని చూసుకోవాలంటూ తీవ్రవాగ్వాదానికి దిగేది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


అదే విషయమై ఈ నెల 24న మరోమారు ఘర్షణ జరగడంతో తల్లి ప్రేమ్ బాయితో కలసి భర్తని తీవ్రంగా కొట్టింది. తల్లీకూతుళ్లు కలసి విచక్షణా రహితంగా దాడి చేయడంతో రమేష్ తీవ్రగాయాలపాలయ్యాడు. గమనించిన రమేష్ తల్లి, సోదరుడు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమేష్ 27న మరణించాడు.

Also Read: కోవిడ్ ఆస్పత్రిలో కామపిశాచి.. లేడీ డాక్టర్ నోరుమూసి.. దారుణం

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడు చనిపోయే ముందు పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. తన భార్య, ఆమె తల్లి కలసి తనను తీవ్రంగా కొట్టారన్న బాధితుడి వాంగ్మూలం మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసి జైలుకి పంపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.