యాప్నగరం

విశాఖలో పట్టపగలు నడిరోడ్డుపై.. దారుణ హత్య

విశాఖలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ సమీపంలోనే దుండగులు కిరాతకంగా వ్యక్తి చంపేయడం స్థానికంగా అలజడికి కారణమైంది.

Samayam Telugu 21 Mar 2020, 3:43 pm
పట్టపగలు నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య స్టీల్ సిటీలో అలజడి రేపింది. పోలీస్ స్టేషన్‌కి అతి సమీపంలోనే గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేసి పరారవడం స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ ఘటన ప్రశాంతంగా ఉన్న విశాఖ ప్రజలను ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేసింది. నగరంలోని నాలుగో పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణ హత్య చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు బండరాయితో తలపై మోది అమానుషంగా చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.
Samayam Telugu muder


Also Read: విజయవాడ: కూతుళ్లని నీళ్లతొట్టెలో ముంచి.. కసాయి తల్లి ఘాతుకం

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ క్రైం స్పాట్‌కి చేరుకుని ఆధారాలు సేకరించే పనిలో పడింది. నాల్గో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: చీటింగ్: ఎంబీఎస్ జ్యువెలరీ అధినేత పరారీ.. చానల్ మాజీ సీఈవో ఇంట్లో ఆశ్రయం.!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.