యాప్నగరం

తల్లితో గొడవపడిన తమ్ముడు.. అకారణంగా అక్క బలి

సెల్‌ఫోన్ కొనివ్వాలంటూ తల్లితో గొడవపడ్డాడు అరుణ్. ఆ మరుసటి రోజే తల్లీకొడుకులకి మళ్లీ గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన అరుణ్ అక్కని కొట్టి చంపేశాడు.

Samayam Telugu 5 Aug 2020, 8:24 pm
తల్లితో గొడవపడిన కొడుకు కోపంలో అక్కని కొట్టి చంపేసిన అమానుష ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తంజావూర్ జిల్లా పట్టుకొట్టై ఏరియా తమరన్‌కొట్టైకి చెందిన పి.అరుణ్ కుమార్(29) డిప్లొమా పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. తల్లి ధనరోజా(62), అక్క వల్లికన్ను(36)తో కలసి నివాసం ఉంటున్నాడు. తండ్రి పళనివేల్ కొద్దికాలం కిందట మరణించాడు. అక్కకి వివాహమైనప్పటికీ ఆరేళ్లుగా పుట్టింటి వద్దే ఉంటోంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


జులాయిగా తిరుగుతున్న అరుణ్ కొత్త సెల్‌ఫోన్ కొనివ్వాలంటూ రెండు రోజుల కిందట గొడవపడ్డాడు. బంగారం తాకట్టుపెట్టి కొనిస్తానని ఆమె చెప్పడంతో శాంతించాడు. మరుసటి రోజు మరో విషయమై మళ్లీ గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కన్నతల్లి అని కూడా చూడకుండా కర్ర తీసుకుని వెంటపడ్డాడు. ఆమె తప్పించుకుని ఇంటి నుంచి బయటకు పరిగెత్తింది.

Also Read: కోవిడ్ శవాలనూ వదలని దుర్మార్గులు.! తిరుపతిలో ఘోరం

ఆగ్రహంతో ఊగిపోయిన అరుణ్ దృష్టి ఇంట్లోనే ఉన్న అక్కపై పడింది. కర్రతో ఆమెను విచక్షణా రహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. అంతటితో ఆగని దుర్మార్గుడు గొంతునులిమి అమానుషంగా చంపేశాడు. అకారణంగా తమ్ముడి చేతిలో అక్క ప్రాణాలు కోల్పోయింది. తల్లి బయటికి పారిపోయి ప్రాణాలు దక్కించుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also: కొడుకుతో కోడలు సెక్స్ చేయకూడదట! అడ్డుపడుతున్న మామ.. చివరికి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.