యాప్నగరం

మందుమత్తులో భర్త ఘాతుకం.. నంద్యాలలో దారుణం

ఫుల్లుగా తాగి ఇంటికొచ్చాడు చలపతి. దీంతో భార్య కుమారి అతనితో గొడవపడింది. మద్యం మత్తులో ఉన్న చలపతి ఉన్మాదిగా మారి ఆమెను దారుణంగా పొడిచి చంపేశాడు.

Samayam Telugu 20 May 2020, 12:44 pm
లాక్‌డౌన్‌తో మూతపడిన మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మందుబాబుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. ఫుల్లుగా తాగి ఏం చేస్తున్నారో తెలియని ఉన్మాదంలో దారుణాలకు తెగబడుతున్నారు. మద్యం మత్తులో భార్యను కిరాతకంగా పొడిచి చంపేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


నంద్యాల మండలంలోని రైతునగరానికి చెందిన చలపతి, కుమారి(49) దంపతులకు నలుగురు కొడుకులు సంతానం. కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన చలపతి నిత్యం భార్యతో గొడవపడుతుండేవాడు. అదే విషయమై తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట భర్త ఫుల్లుగా తాగి ఇంటికి రావడంతో భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Also Read: కొడుకు నీచం.. కన్నతల్లి నగ్నచిత్రాలు తీసి..

ఇద్దరి నడుమ వివాదం ముదరడంతో విచక్షణ కోల్పోయిన చలపతి ఇంట్లో ఉన్న కత్తెర తీసుకుని భార్యని పొడిచేశాడు. పలుమార్లు పొడిచి కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం వారి కొడుకు లేచి చేసేసరికి తల్లి కుమారి రక్తపు మడుగులో పడిపోయి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Read Also: లేడీ పోలీస్ వీరంగం.. యువకుడిని స్టేషన్‌లో పడేసి కాళ్లతో తన్ని..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.