యాప్నగరం

భార్యాబిడ్డలని నరికేసిన రాక్షసుడు.. నలుగురి దారుణ హత్య

కుటుంబంతో సహా వలసొచ్చిన కూలీ బేల్దారి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. సడెన్‌గా భార్యబిడ్డలను హత్య చేసి కనిపించకుండా పోయాడు.

Samayam Telugu 3 Sep 2020, 7:14 pm
కట్టుకున్న భార్యను, కన్నబిడ్డలను కిరాతకంగా అంతమొందించాడో కసాయి. నలుగురిని గొడ్డలితో నరికి చంపేశాడు నరరూప రాక్షసుడు. ఈ అత్యంత దారుణ ఘటన హర్యానాలోని మహేంద్రగఢ్‌ జిల్లా నార్నౌల్‌లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ జిల్లాకు చెందిన తులసీదాస్ కుటుంబంతో సహా వలసవచ్చి స్థానికంగా తాత్కాలిక నివాసంలో ఉంటున్నాడు. బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏమోందో ఏమో తెలియదు భార్యాబిడ్డలను అత్యంత దారుణంగా చంపేశాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


భార్య ఆర్తి, 6, 7 సంవత్సరాల వయసున్న ఇద్దరు కొడుకులు, నాలుగేళ్ల కూతురిని కిరాతకంగా హత్య చేశాడు. నలుగురినీ గొడ్డలితో నరికి అత్యంత అమానుషంగా చంపేశాడు. ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడం.. ఎలాంటి కదలికలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెళ్లి చూడడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో భార్యతో సహా నలుగురు రక్తపు మడుగులో విగతజీవులుగా కనిపించారు.

Also Read: బాలామణి బాగోతం బట్టబయలు.. వీడిన అమలాపురం మర్డర్ మిస్టరీ

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదని.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు నార్నౌల్ ఎస్‌హెచ్‌వో మనోజ్ కుమార్ తెలిపారు.

Read Also: నా భార్యతో బెడ్రూమ్‌లో దొరికాడు.. ఆమెని దోచుకున్నాడు.. భర్త షాకింగ్ కంప్లైంట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.