యాప్నగరం

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వెనక దారుణ హత్య.. భూపాలపల్లిలో కలకలం

భూపాల్‌పల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వెనక దారుణ హత్య జరిగింది. చెల్పూరుకి చెందిన సునీల్‌ని గుర్తుతెలియని వ్యక్తులు అమానుషంగా కొట్టి చంపేశారు.

Samayam Telugu 21 Jun 2020, 6:35 pm
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వెనుక వ్యక్తి దారుణ హత్య జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. పట్టణంలోని మంజూర్ నగర్‌లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనుక శ్రీలక్ష్మి వెంచర్‌లో గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. బండరాయితో మోది అమానుషంగా చంపేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. మృతుడిని గణపురం మండలం చెల్పూరుకి చెందిన హరిసునీల్(40)గా గుర్తించారు. సునీల్ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యే కార్యాలయం వెనక హత్య జరగడం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: బాలికపై టెన్త్ విద్యార్థుల పైశాచికం.. సెక్స్ వీడియోలు చూపించి.. పదేపదే అత్యాచారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.