యాప్నగరం

భార్యతో గొడవపడి ఆరుబయట పడుకున్న భర్త.. తెల్లారేసరికి శవమై

బుధవారం రాత్రి భార్యతో గొడవపడి ఆరుబయట పడుకున్న నాగేంద్రను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. బంధువులే అతడిని హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Samayam Telugu 29 May 2020, 11:55 am
కడప పట్టణ శివారులోని భగత్‌సింగ్‌నగర్‌లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. రాత్రి నిద్రపోతున్న సమయంలో దుండుగులు అతడిపై దాడి చేసి హత్య చేశారు. అయితే బంధువులే ఈ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన పాలకొల్లు నాగేంద్ర అలియాస్‌ నాగేష్‌ (40) లక్షీదేవిలకు కొన్నేళ్ల కిందట వివాహమైంది. వీరికి 15 ఏళ్ల కూతురు ఉంది. నాగేంద్ర ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే నాగేంద్ర కొద్దిరోజులుగా మద్యానికి బానిసై భార్య, కూతురిని వేధిస్తున్నాడు.
Samayam Telugu Image


Also Read: ప్రేమోన్మాది పైశాచికం.. ప్రియురాలిపై కత్తితో దాడి, విషం తాగి ఆత్మహత్య

ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి కూడా నాగేంద్ర ఇంట్లో గొడవపడి బయట మంచం వేసుకుని పడుకున్నాడు. అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నాగేంద్రను మంచం కొళ్లతో తలపై ఛాతిపై, ముఖంపై తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కడప డీఎస్పీ సూర్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించిన వివరాలు సేకరించారు. నాగేంద్ర హత్య వెనుక బంధువుల హస్తమున్నట్లు స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగేంద్ర సమీప బంధువును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

Also Read: అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదని మాజీ ప్రియురాలిపై హత్యాయత్నం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.