యాప్నగరం

భార్యను కొడుతుండగా అడ్డొచ్చిందని అత్త హత్య.. తూ.గో. జిల్లాలో దారుణం

భార్యను కొడుకుతుండగా అడ్డొచ్చిందని అత్తను ఇనుప రాడ్‌తొ కొట్టి చంపేశాడో వ్యక్తి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలో వెలుగుచూసింది.

Samayam Telugu 12 Jun 2020, 3:51 pm
అల్లుడు చేతిలో అత్త హత్యకు గురైన ఘటన తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని బలరాంపురం గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. ఇల్లరికం వచ్చి అత్తమామల్ని కొడుకులా చూసుకుంటున్న వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడటంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. తాపీ పని చేసుకుంటూ జీవనం సాగించే ఏసుబాబు భార్య, పిల్లలు, అత్తమామలు సోమరౌతు నూకరత్నం, జగ్గప్పదొరలతో కలిసి కొన్నేళ్లుగా బలరాంపురంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల మద్యానికి బానిసైన ఏసుబాబు తరుచూ భార్యతో గొడవపడుతున్నాడు.
Samayam Telugu నూకరత్నం, ఏసుబాబు ఫైల్ ఫోటోలు


Also Read: డ్రగ్స్‌కు‌ బానిసైన కానిస్టేబుల్... పెళ్లయిన 3నెలలకే భార్యకు నరకం చూపించి

బుధవారం రాత్రి ఫుల్లగా మద్యం తాగి ఇంటికొచ్చిన ఏసుబాబు భార్యతో గొడవపడ్డాడు. భార్యపై చేయి చేసుకోవడంతో అత్త నూకరత్నం(62) అడ్డుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు ఇనుప రాడ్డుతో ఆమె తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు రౌతులపూడి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుంగా మార్గమధ్యంలో మృతిచెందింది. దీనిపై సమాచారం అందుకున్న కోటనందూరు పోలీసులు నూకరత్నం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏసుబాబుపై హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Also Read: అప్పు ఇచ్చిన మహిళపై కానిస్టేబుల్ అఘాయిత్యం.. ఒంగోలులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.