యాప్నగరం

ఉమ్మడిగా ఉండలేనన్న తమ్ముడు.. వేరుకాపురం పెట్టలేదని మనస్థాపం.. చివరికి..

ఉమ్మడి కుటుంబం నుంచి వేరుపడదామనుకున్న సాక్షప్ప భూములు పంచాలని కోరాడు. ఆ భూముల పంచాయితీ తేలకపోవడంతో తీవ్ర మనస్థాపంతో సూసైడ్ చేసుకున్నాడు.

Samayam Telugu 30 Apr 2020, 4:20 pm
అప్పటి వరకూ అన్నతో కలసి ఉన్న తమ్ముడు వేరుకాపురం పెట్టేందుకు రెడీ అయ్యాడు. అన్నదమ్ములు ఆస్తులు పంచుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే భూముల పంపకాల పంచాయితీ ఎంతకీ తేలకపోవడంతో వేరుకాపురం పెట్టుకుందామనుకున్న తమ్ముడి ఆశ నెరవేరలేదు. దీంతో మనస్థాపానికి గురైన తమ్ముడు తన తోటలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


జిల్లాలోని కబదూర్ మండలం మర్రిమాకులపల్లికి చెందిన గొల్ల నాగరాజు, సాక్షప్ప అన్నదమ్ములు. ఏడాది కిందటే తమ్ముడికి వివాహమైంది. అన్నదమ్ములిద్దరూ ఉమ్మడిగా ఉంటూ తమ భూములు సాగు చేసుకుని జీవిస్తున్నారు. అయితే ఉమ్మడి కుటుంబం నుంచి వేరుపడదామని భావించిన తమ్ముడు ఆస్తి పంపకాలు చేయాలని కోరాడు. అయితే భూముల సమస్య ఎంతకీ కొలిక్కిరాలేదు.

Also Read: తండ్రి తల నరికి చంపిన కొడుకు.. దొరికిపోకుండా హైడ్రామా.. వీడిన లక్ష్మీపూర్ మర్డర్ మిస్టరీ

వేరుకాపురం పెట్టుకుందామనుకున్న సాక్షప్ప ఆశ నెరవేరలేదు. భూముల పంచాయితీ తేలలేదు. దీంతో మనస్థాపానికి గురైన సాక్షప్ప అఘాయిత్యం చేసుకున్నాడు. తన తోటలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: క‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసుల దుర్మరణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.