యాప్నగరం

మతితప్పిన యువకుడికి లక్షలతో ట్రీట్మెంట్.. అన్నీ గుర్తొచ్చాక అప్పులు చూసి ఆత్మహత్య

ప్రమాదంలో నాగరాజుకి మతిస్థిమితం తప్పింది. ఎలాగో వైద్యం అందించడంతో నెమ్మదిగా కోలుకున్నాడు. అంతా కుదురుకుంటోందనే సమయంలో ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు.

Samayam Telugu 16 May 2020, 5:02 pm
రోడ్డు ప్రమాదం అతనిని పిచ్చివాడిని చేసింది. మతిస్థిమితం కోల్పోయి ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితికి దిగజార్చింది. భారమైనా లక్షలు ఖర్చు చేసి ట్రీట్మెంట్ ఇప్పించడంతో క్రమంగా కోలుకున్నాడు. నెమ్మదిగా అన్నీ గుర్తొచ్చిన ఆ యువకుడు అప్పులు చూసి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వెలుగుచూసింది. ఇద్దరు కూతుళ్లు.. కడుపులో బిడ్డను మోస్తున్న భార్యని వదిలి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


జిల్లాలోని రామాపురానికి చెందిన ఎర్రగుండ్ల నాగరాజు(35) రెండేళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితం కోల్పోయాడు. కుటుంబానికి భారమైనా లక్షలు ఖర్చు చేసి అతనికి వైద్యం చేయించారు. నెమ్మదిగా నాగరాజు కోలుకున్నాడు. అంతా కుదుటపడుతుందనుకునే లోపే ఊహించని విషాదం వెంటాడింది. అన్నీ గుర్తొచ్చాక అప్పులు చూసి నాగరాజుకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: అనంతపురం: భర్తని వదిలేసి ప్రియుడితో సహజీవనం.. సీన్‌లోకి అతని భార్య.. చివరికి..

తన వైద్యానికి చేసిన రెండు లక్షలు, వ్యవసాయం కోసం చేసిన మూడు లక్షలు.. వాటి వడ్డీ కొండలా పెరిగిపోవడంతో నాగరాజు కుంగిపోయాడు. అవి తీర్చే దారిలేక.. దిక్కుతోచని పరిస్థితిలో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తెల్లవారుజాము సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గర్భంతో ఉన్న భార్యని, ఇద్దరు కూతుళ్లని వదిలి నాగరాజు ఆత్మహత్య చేసుకోవడం గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది.

Read Also:
కన్నకూతురిపై తండ్రి అత్యాచారం.. నోట్లో గుడ్డలు కుక్కిన తల్లి.. మంచానికి కట్టేసి దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.