యాప్నగరం

35 ఏళ్లొచ్చినా పెళ్లి కావడం లేదని ఉరేసుకున్న యువకుడు

35ఏళ్లు వచ్చినా పెళ్లి కావడం లేదన్న కారణంతో ఉమామహేశ్వరరావు కొన్నాళ్లుగా మనస్తాపంతో ఉంటున్నాడు. సంక్రాంతికి అందరూ స్వగ్రామానికి వెళ్లడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Samayam Telugu 21 Jan 2020, 4:21 pm
వయసు పెరుగుతున్నా పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ నగరంలో వెలుగుచూసింది. శ్రీకాకుళం జిల్లా అమదాలవలసకు చెందిన సింగూరు ఉమామహేశ్వరరావు (35) విశాఖ అక్కయ్యపాలెంలోని శ్రీనివాస్‌నగర్‌లో నివాసముంటూ స్థానికంగా ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు.
Samayam Telugu images (5)


Also Read: సంక్రాంతికి పుట్టింటికి వచ్చి.. ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య

సంక్రాంతి పండుగకు కుటుంబ సభ్యులందరూ శ్రీకాకుళంలోని స్వగ్రామానికి వెళ్లడంతోఉమామహేశ్వరరావు ఒంటరిగా ఉన్నాడు. తనకు పెళ్లి కావడం లేదని ఎప్పటి నుంచో ఆవేదన చెందుతున్న అతడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్‌‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో మేడపై ఉన్న యజమాని స్థానిక యువకుల సహాయంతో తలుపులు తెరిచి చూసి షాకయ్యాడు. దీంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.

Also Read: వరుడి తండ్రితో వధువు తల్లి పరార్... ఇదో వింత ప్రేమాయణం

నాలుగో పట్టణ ఎస్‌ఐ సూర్యానారాయణ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఉమామహేశ్వరరావు రెండు, మూడు రోజుల కిందటే ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌ మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.

Also Read: పోర్న్‌ వెబ్‌సైట్లో ప్రత్యక్షమైన శోభనం రాత్రి దృశ్యాలు.. కొత్తజంటకు ‘స్మార్ట్’ షాక్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.