యాప్నగరం

ప్రియురాలు నో చెప్పిందని యువకుడి అఘాయిత్యం.. కృష్ణా జిల్లాలో విషాదం

ప్రేమ విఫలమైందని.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాజు స్నేహితుడు పెద్దిరాజుకి ఫోన్ చేశాడు. కంగారుపడిన పెద్దిరాజు వెంటనే విషయం రాజు సోదరుడికి చెప్పాడు. అక్కడికి వెళ్లి చూసే సరికి..

Samayam Telugu 14 Jul 2020, 2:35 pm
ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తిరస్కరించిందన్న బాధతో ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చేయి కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేప్పటికే చాలా సమయం గడచిపోవడంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


జిల్లాలోని కైకలూరు ఎన్జీవో కాలనీకి చెందిన రాజు(26) అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఆమె నిరాకరించడంతో తీవ్రమనస్థాపానికి గురయ్యాడు. అమ్మాయి తిరస్కరించిందని జీవితంపై విరక్తి పెంచుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రైల్వేస్టేషన్ సమీపంలోని రైస్ మిల్లు ఆవరణలో బ్లేడుతో చేయి కోసుకున్నాడు.

Also Read: స్వామీజీ బట్టలిప్పేసి.. పోర్న్ వీడియోలు చూపించి.. దారుణం

అనంతరం తన స్నేహితుడికి ఫోన్ చేసి లవ్ ఫెయిలైందని.. తాను చనిపోతున్నానని చెప్పడంతో అతను వెంటనే రాజు సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. రైస్ మిల్లు వద్దకు చేరుకునే సరికి రాజు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. చాలా సమయం గడచిపోవడంతో తీవ్రరక్తస్రావమై ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Read Also:
వదినపై కన్నేసిన మరిది.. బలవంతంగా లాక్కెళ్లి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.