యాప్నగరం

Hyd: అత్తింటి వేధింపులతో అల్లుడి ఆత్మహత్య.. షాకింగ్ ఘటన

కాపురంలో కలహాలు రేగడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తమామల జోక్యంతో గొడవలు మరింత పెరిగిపోయాయి. భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపం చెందిన భర్త..

Samayam Telugu 7 Oct 2020, 12:37 pm
అత్తింటి వేధింపులు తాళలేక కోడలి ఆత్మహత్య ఘటనలు వింటూనే ఉంటాం. కానీ భార్యతో కలసి అత్తింటి వారు వేధింపులకు గురిచేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై అల్లుడు ఆత్మహత్య చేసుకున్న షాకింగ్ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. కంచన్ బాగ్ పరిధిలోని హఫీజ్ బాబా నగర్‌కి చెందిన సయ్యద్ మహమూద్ కుమారుడు సయ్యద్ మోహ్సిన్‌కి కామారెడ్డికి చెందిన యువతితో ఏడాది కిందట వివాహమైంది. కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు రేగాయి.
Samayam Telugu ఆత్మహత్యకు పాల్పడిన మోహ్సిన్(పెళ్లి ఫొటో)
suicide


అత్తమామల జోక్యం పెరిగిపోవడంతో కాపురంలో గొడవలు కూడా పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆర్నెల్ల కిందట మోహ్సిన్ భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రావాలని ఎన్నిసార్లు పిలిచినా ప్రయోజనం లేకపోయింది. పెద్దమనుషుల సమక్షంలో రాజీ చేయాలని ప్రయత్నించినా వినకపోవడంతో మోహ్సిన్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అత్తమామల వేధింపుల కారణంగానే మోహ్సిన్ అఘాయిత్యానికి ఒడిగట్టాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: రోజూ వచ్చే లారీడ్రైవర్‌తో సహజీవనం.. చివరికి దారుణంRead Also: టీనేజ్ యువతి కిడ్నాప్, అత్యాచారం.. పశ్చిమ గోదావరిలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.