యాప్నగరం

కామారెడ్డి: ఆర్థిక ఇబ్బందులతో కూతురికి విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

కరోనా కారణంగా ఉపాధి లేకపోవడంతో అక్బర్ మనోవేదనకు గురయ్యాడు. కూతురికి ఒక్కపూట కూడా తిండి పెట్టలేక ఆత్మహత్యే శరణ్యమనుకుని ఆమెతో కలిసి పురుగులమందు తాగేశాడు.

Samayam Telugu 6 Aug 2020, 1:30 pm
ఆర్థిక ఇబ్బందులు తండ్రీ కూతురి ప్రాణాలు తీసిన విషాదకర ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. కామారెడ్డిలోని గోసంగి కాలనీలో నివాసముండే అక్బర్(48), కూతురు సైరాబేగం(5)తో కలిసి నివసిస్తున్నాడు. అతడి భార్య కొంతకాలం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో కూతురి ఆలనాపాలనా తానే చూస్తున్నాడు. రోడ్డుపై బొమ్ములు, బెలూన్లు విక్రయిస్తూ జీవిస్తున్నాడు.
Samayam Telugu విచారిస్తున్న పోలీసులు


Also Read: చేపల కూర వండలేదని... 9 నెలల గర్భిణిని కొట్టి చంపిన భర్త

అయితే లాక్‌డౌన్ కారణంగా కొద్ది నెలలుగా ఉపాధి లేకపోవడంతో అక్బర్‌కు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. కూతురికి ఒక్కపూట కూడా తిండి పెట్టలేని స్థితికి చేరుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కష్టాలతో బ్రతకడం కంటే చావే మంచిదని భావించాడు. బుధవారం కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి కూతురితో తాగించిన అక్బర్.. అనంతరం తాను కూడా తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: వివాహితతో సహజీవనం.. అనుమానంతో గొంతు నులిమి చంపేసి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.