యాప్నగరం

హిజ్రాతో పీకల్లోతు ప్రేమ.. నెలరోజులు సహజీవనం.. చివరికి ఇద్దరూ కలిసి

హిజ్రా శివానీపై మనసు పడిన దిలీప్‌ పెద్దలను ఎదిరించి నెలరోజులుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. శనివారం ఇద్దరూ ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్నారు.

Samayam Telugu 21 Jun 2020, 12:17 pm
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని కారైక్కాల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెద్దలను ఎదిరించి హిజ్రాతో నెల రోజులుగా సహజీవనం చేస్తున్న యువకుడు ఆమెతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కారైక్కాల్‌ జిల్లాలోనికి తిరునల్లారుకు చెందిన దిలీప్‌ (26)కు ఆరు నెలల క్రితం నిరావీ ప్రాంతానికి చెందిన శివానీ(30) అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. క్రమంగా అదికాస్తా ప్రేమగా మారి ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు.
Samayam Telugu శివానీ, దిలీప్(ఫైల్ ఫోటోలు)


Also Read: కృష్ణా జిల్లాలో యువకుడి దారుణహత్య.. అర్ధరాత్రి సైకిల్‌పై వెళ్తుండగా దారికాచి

ఈ విషయం తెలుసుకున్న దిలీప్ కుటుంబసభ్యులు అతడిని తీవ్రంగా మందలించారు. తాను శివానీ లేకుండా బ్రతకలేనని స్పష్టం చేసిన అతడు నెల రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. హిజ్రాతో కలిసి కారైక్కాల్‌ ఒడుదురై ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని సహజీనవం చేస్తున్నాడు. అయితే ఇద్దరి మధ్య కొద్దిరోజులుగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఇద్దరూ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: హైదరాబాద్‌లో వృద్ధురాలి దారుణహత్య.. నగలతో ఉడాయించిన పనిమనిషి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.