యాప్నగరం

కూకట్‌పల్లి ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఒకరి మృతి

హైదరాబాద్‌లో భారీ పేలుడు ఘటన జరిగింది. ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఒకరు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 26 Feb 2020, 6:08 pm
హైదరాబాద్‌లోని ఓ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం సంభవించింది. కూకట్‌పల్లి సమీపంలో ఉన్న ఐడీఎల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ కార్పొరేషన్‌ కంపెనీ అయిన ఐడీఎల్‌లో ఓ రియాక్టర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు సమాచారం.
Samayam Telugu explosion


Also Read: శాప విముక్తి కోసమట.! ఐదుగురు అక్కాచెల్లెళ్లను నగ్నంగా నిలబెట్టి..

రియాక్టర్ పేలడంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు అంటుకుని శర్మ అనే కార్మికుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: తమలపాకు కోసం అత్త దగ్గరికి.. మెల్లిగా కోడలితో ఎఫైర్.. బెడ్రూమ్‌లో దొరికిపోవడంతో..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.