యాప్నగరం

పెళ్లయిన రెండు నెలలకే భార్య హత్య.. కాసేపటికే యాక్సిడెంట్‌లో భర్త మృతి

రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా చంపేసిన వెంకటరావు అదే రోజు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

Samayam Telugu 2 Aug 2020, 1:40 pm
రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్న నవ దంపతులు ఒకే రోజు మృతిచెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన బాలి వెంకటరావు (55) మొదటి భార్య చనిపోవడంతో ఈ ఏడాది జూన్‌ 13న విజయనగరం అయ్యన్నపేటకు చెందిన కర్రోతు పార్వతి (48)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆషాఢానికి వెళ్లిన పార్వతి ఇటీవలే వేల్పురాయి గ్రామానికి వచ్చింది. శుక్రవారం రాత్రి పక్కింట్లో పడుకున్న వెంకటరావు మొదటి భార్య కుమారుడు రామానాయుడు శనివారం ఉదయం సొంతింటికి వచ్చి చూసేసరికి పార్వతి రక్తపుమడుగులో శవమై కనిపించింది. దీంతో అతడు వెంటనే స్థానికులకు, బంధువులకు సమాచారం ఇచ్చాడు.
Samayam Telugu Image


Also Read: నగ్న ఫోటోలు పంపాలంటూ మహిళా న్యాయవాదికి వేధింపులు

దీంతో పార్వతి సోదరుడు కర్రోతు పైడిరాజు మృతదేహాన్ని పరిశీలించాడు. తన సోదరిని భర్త వెంకటరావు పారతో తలపై కొట్టి చంపేశాడని జేఆర్ పురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. కాసేపటికే వెంకటరావు పైడిభీమవరంలో జరిగిన రోడ్డుప్రమాదంలో చనిపోయినట్లు సమాచారం అందింది. దీంతో కొడుకు రామానాయుడు అక్కడికి వెళ్లి పరిశీలించాడు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వస్తున్న లారీ తన తండ్రికి ఢీకొనడంతో వల్లే చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ రెండు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: సంతానం కోసం రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.