యాప్నగరం

భార్యను బెదిరించబోయి... మెడకు తాడు బిగుసుకుని వ్యక్తి మృతి

కువైట్‌లో ఉన్న భార్యను ఇంటికి వచ్చేయమని బెదిరించిన భర్త.. ఆత్మహత్య చేసుకుంటానంటూ నాటకమాడాడు. అయితే ప్రమాదవశాత్తూ మెడకు తాడు బిగుసుకుని ప్రాణాలు కోల్పోయాడు.

Samayam Telugu 5 May 2020, 9:07 am
ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లిన తన భార్యను స్వస్థలానికి రప్పించేందుకు ఆత్మహత్య నాటకమాడిన ఓ వ్యక్తి నిజంగానే ప్రాణాలు కోల్పోయిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ నువ్వు రాకపోతే ఉరేసుకుంటానని బెదిరించాడు. అయితే ప్రమాదవశాత్తూ కాలు జారడంతో తాడు మెడకు బిగుసుకుని ప్రాణాలు కోల్పోయాడు.
Samayam Telugu Image


Also Read: ఆర్థిక ఇబ్బందులు భరించలేక.. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన జి.గణేష్‌ (35) భార్య బతుకుదెరువు కోసం 5 నెలల కిందట కువైట్‌ వెళ్లింది. ఈ క్రమంలోనే రోజూ ఫోన్లో మాట్లాడుకునే సమయంలో ఇద్దరికీ మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఆమె రెండు నెలలుగా భర్తకు డబ్బులు పంపించడం లేదు. దీంతో భార్యను తిరిగొచ్చేయాలంటూ అతడు ఒత్తిడి తెస్తున్నాడు. అయితే తాను ఇప్పుడప్పుడే ఇంటికి రానని ఆమె తెగేసి చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు.

Also Read: బంధువుల చేతిలో యువకుడి దారుణహత్య.. నెల్లూరు జిల్లాలో దారుణం

ఆదివారం రాత్రి భార్యకు వీడియో కాల్ చేసిన గణేశ్ ‘నువ్వు ఇంటికి రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ ఫ్యాన్‌కు ఉరేసుకుంటున్నట్లు నాటకమాడాడు. అదే సమయంలో ప్రమాదవశాత్తూ అతడి కాలు జారి తాడు మెడకు బిగుసుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అంతా సెల్‌ఫోన్లో రికార్డ్ అయింది. బంధువుల ఫిర్యాదుతో ఎస్ఐ సతీష్ సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: ఫ్రెండ్స్‌తో కలిసి భార్యపైనే గ్యాంగ్ రేప్.. డబ్బుల కోసం నీచానికి పాల్పడిన భర్త

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.