యాప్నగరం

వ్యక్తి ప్రాణం తీసిన గేదె.. షాకింగ్ ఘటన

నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి వైపు ఊహించని ప్రమాదం ముంచుకొచ్చింది. పశువు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వ్యక్తిని బలితీసుకుంది.

Samayam Telugu 16 Aug 2020, 4:43 pm
రోడ్డుపైకి వస్తే ఇంటికి తిరిగి వెళ్తారో లేదో చెప్పలేని పరిస్థితి. ప్రమాదం ఎటునుంచి ముంచుకొస్తుందో.. ఎవరిని మింగేస్తుందో తెలియదు. తాజాగా అలాంటి ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై తనపాటికి తాను నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి పశువు చేతిలో ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా దూసుకొచ్చిన గేదె తగలడంతో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ నార్సింగ్‌లో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
buffalo attack


నార్సింగ్ ఏరియాలోని జన్వాడకి చెందిన మైసయ్య(52) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఊహించని ప్రమాదం ఆయనను బలిగొంది. ఖానాపూర్ నుంచి జన్వాడ నడుచుకుంటూ వెళ్తుండగా అదుపుతప్పిన గేదె ఆయన వైపు దూసుకొచ్చింది. వేగంగా వచ్చిన గేదె ఢీకొట్టడంతో మైసయ్యకి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందంటూ ఉస్మానియాకి రెఫర్ చేశారు. అక్కడి చికిత్స పొందుతూ మైసయ్య ప్రాణాలు కోల్పోయాడు. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఇంటి ఓనర్ భార్యతో మాటలు కలిపిన భర్త.. భార్య కంటపడడంతో.!Read Also: భర్త నైట్ డ్యూటీకి.. ఇంట్లో భార్య ఒంటరిగా ఉండడంతో.. దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.