యాప్నగరం

Visakha పైప్‌లైన్ పనుల్లో విషాదం.. క్రేన్ ఆపరేటర్ దుర్మరణం

నగర పాలక సంస్థ చేపట్టిన పైప్‌లైన్ పనుల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పైపులు పైకి ఎత్తే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 29 Apr 2020, 6:54 pm
విశాఖ నగరంలో చేపట్టిన పైప్‌లైన్ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ క్రేన్ ఆపరేటర్ మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది విశాఖ నగరపాలక సంస్థ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో పైపు లైన్ నిర్మాణ పనులు చేపట్టారు. పైపులు ఏర్పాటు చేసేందుకు క్రేన్ వినియోగిస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


నరవ వద్ద పైపును పైకి ఎత్తే క్రమంలో క్రేన్‌ హైటెన్షన్ విద్యుత్ లైన్ కు తగిలింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండడంతో ఒక్కసారిగా షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్రేన్ దగ్ధమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: తండ్రి తల నరికి చంపిన కొడుకు.. దొరికిపోకుండా హైడ్రామా.. వీడిన లక్ష్మీపూర్ మర్డర్ మిస్టరీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.