యాప్నగరం

పండగకి అత్తారింటికెళ్లి తిరిగిరాని అల్లుడు.. ప.గో.లో మిస్టరీ మరణం

క్రిస్మస్ పండగకి నరేంద్ర అత్తారింటికి వెళ్లాడు. నాలుగు రోజుల తర్వాత కాల్వలో శవమై కనిపించాడు. గొడవపడి వెళ్లిపోయాడని భార్య చెబుతోంది. ఇంతకీ ఏం జరిగింది?

Samayam Telugu 29 Dec 2020, 2:13 pm
పండగకి అత్తారింటికెళ్లిన అల్లుడు తిరిగిరాలేదు. గొడవపడి వెళ్లిపోయాడని కోడలు ఫోన్ చేసి చెప్పింది. కానీ కొడుకు ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తీరా మూడు రోజుల తర్వాత కాల్వలో శవమై కనిపించడం మిస్టరీగా మారింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వీరవాసరం మండలం అండలూరుకి చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన నరేంద్ర(26)తో వివాహమైంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
death


క్రిస్మస్ పండుగ రావడంతో ముందు రోజు అత్తారింటికి వెళ్లిన నరేంద్ర ఇంటికి తిరిగిరాలేదు. తనతో గొడవపడి వెళ్లిపోయాడని కోడలు మామకి ఫోన్ చేసి చెప్పింది. కంగారుపడిన మామ తన కొడుకు కనిపించడం లేదని వీరవాసరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనూహ్యంగా మూడు రోజుల అనంతరం పంటకాల్వలో నరేంద్ర శవమై కనిపించాడు. వీరవాసరం రోడ్డులోని అండలూరు వెళ్లే పంటకాల్వలో మృతదేహం లభ్యమైంది.

యువకుడి శవం పడి ఉందని స్థానికులు సమాచారం అందించడంతో పాలకోడేరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి జేబులోని డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు ఆధారంగా నరేంద్రగా గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అత్తారింటికి వెళ్లిన అల్లుడు పంటకాల్వలో శవమై తేలడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.