యాప్నగరం

కన్నకొడుకుని నరికి చంపిన కసాయి తండ్రి.. కృష్ణా జిల్లాలో దారుణం

కొడుకుపాలిట కాలయముడిగా మారాడు తండ్రి. ఫుల్లుగా తాగి ఇంటికొచ్చి కొడుకుతో గొడవపడి గొడ్డలితో నరికేశాడు. ఈ ఘటన పెడనలో జరిగింది.

Samayam Telugu 29 Oct 2020, 2:24 pm
కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాగిన మైకంలో తనయుడిని నరికి చంపాడో కసాయి తండ్రి. గొడ్డలితో నరకడంతో కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పెడన మండలం ఉప్పలకలవగుంటలో జరిగింది. గ్రామానికి చెందిన భూపతి వెంకటేశ్వరరావు మద్యం తాగి ఇంటికొచ్చి కొడుకు ఏడుకొండలుతో గొడవకు దిగారు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో మద్యం మత్తులో ఉన్న తండ్రి దారుణానికి తెగబడ్డాడు. ఆగ్రహంతో ఊగిపోతూ గొడ్డలి తీసుకుని కొడుకుని నరికేశాడు. ఈ దాడిలో కొడుకు ఏడుకొండలుకు తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని వెంటనే బంధువులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
vijayawada murder


Also Read: తల్లి ప్రియుడితో కూతురి పెళ్లి.. చివరికి.. హైదరాబాద్‌లో దారుణ ఘటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.