యాప్నగరం

రూ.20 కోసం అమానుషం.. నిద్రపోతున్న ఫ్రెండ్‌ని గొడ్డలితో నరికి..

ఇరవై రూపాయల అప్పు ఓ మనిషి ప్రాణం మీదకు తెచ్చింది. డబ్బులు తిరిగివ్వలేదన్న కోపంతో నిద్రపోతున్న స్నేహితుడిని గొడ్డలితో నరికేశాడు.

Samayam Telugu 26 Jul 2020, 9:02 pm
మద్యం మత్తులో మృగంగా మారిన యువకుడు కేవలం 20 రూపాయల కోసం స్నేహితుడిని నరికేసిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. అర్ధవీడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన నల్లబోతుల వెంకటయ్య, ప్రతాప్ స్నేహితులు. గతంలో ప్రతాప్‌కి వెంకటయ్య 20 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అవి తిరిగి ఇవ్వాలంటూ మద్యం మత్తులో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.
Samayam Telugu గొడ్డలితో దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రతాప్
attack with axe


ఇరవై రూపాయల కోసం జరిగిన వివాదం చినికిచినికి గాలివానగా మారింది. డబ్బులు తిరిగివ్వలేదని కోపం పెంచుకున్న వెంకటయ్య మద్యం మత్తులో దారుణానికి పాల్పడ్డాడు. నిద్రిస్తున్న ప్రతాప్‌ని గొడ్డలితో నరికేశాడు. తీవ్రగాయాలపాలైన ప్రతాప్‌ని స్థానికులు 108 వాహనంలో కంభం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: భర్త కోసం బిడ్డను చంపేసిన భార్య.. విజయనగరంలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.