యాప్నగరం

ఫోన్ ఎత్తలేదని భార్యని గొడ్డలితో నరికి.. కడపలో దారుణం

మద్యం షాపులు తెరుచుకున్న రోజే మందుబాబు దారుణానికి పాల్పడ్డాడు. ఫుల్లుగా మద్యం తాగి మత్తులో భార్యని గొడ్డలితో నరికేసిన దారుణ ఘటన కడప జిల్లాలో జరిగింది.

Samayam Telugu 5 May 2020, 5:00 pm
ఫోన్ ఎత్తలేదనే చిన్న కారణంతో భార్యని గొడ్డలితో నరికేశాడో కసాయి భర్త. మద్యం మత్తులో భార్యతో ఉన్మాదిగా మారిన భర్త ఫోన్ ఎందుకు తీయలేదంటూ గొడవపడి గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ అమానుష ఘటన కడప జిల్లా రాజంపేటలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


జిల్లాకు చెందిన గిరిజన దంపతులు పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లెలోని మామిడితోటలకు కాపలా ఉంటూ అక్కడే నివాసం ఉంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా మూతపడిన మద్యం షాపులు తెరవడంతో భర్త గంటలకొద్దీ క్యూ లైన్‌లో నిల్చుని మద్యం కొనుగోలు చేశాడు. అర్ధరాత్రి వరకూ మద్యం తాగి ఎంజాయ్ చేశాడు.

Also Read: మద్యం మత్తులో కొట్టుకున్న రూమ్‌మేట్స్.. ఒకరి మృతి.. విశాఖలో విషాదం

ఫుల్లుగా తాగేసి మద్యం మత్తులో భార్యతో గొడవకు దిగాడు. ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేదంటూ గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్యకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.