యాప్నగరం

కట్టుకున్న భార్యను కసితీరా గొంతుకోసి.. కర్నూలులో దారుణం

కట్టుకున్న భర్త ఆవారాగా పనీపాటాలేకుండా తిరుగుతున్నాడని వేదనకు గురైన మహిళ.. మెట్టినిల్లు వదిలేసి పుట్టిన ఊరికి చేరింది. పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటోంది. తను పట్టించుకోకపోయినా ఇంటిని చక్కబెట్టుకుంటున్న ఆ ఇల్లాలిని బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి.. కక్ష పెంచుకున్నాడు కసాయి భర్త. తనను వదిలేసిందన్న కారణంతో ఆమెను కిరాతకంగా గొంతుకోసి చంపేశాడు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. అనంతరం తాను కూడా ఉరేసుకుని చనిపోయి పిల్లలను అనాథలను చేసేశాడు.

Samayam Telugu 24 Jan 2020, 4:29 pm
కట్టుకున్న భర్త ఆవారాగా పనీపాటాలేకుండా తిరుగుతున్నాడని వేదనకు గురైన మహిళ.. మెట్టినిల్లు వదిలేసి పుట్టిన ఊరికి చేరింది. పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటోంది. తను పట్టించుకోకపోయినా ఇంటిని చక్కబెట్టుకుంటున్న ఆ ఇల్లాలిని బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి.. కక్ష పెంచుకున్నాడు కసాయి భర్త. తనను వదిలేసిందన్న కారణంతో ఆమెను కిరాతకంగా గొంతుకోసి చంపేశాడు. ఈ దారుణ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. అనంతరం తాను కూడా ఉరేసుకుని చనిపోయి పిల్లలను అనాథలను చేసేశాడు.
Samayam Telugu man hangs himself after killing his wife brutally in kurnool
కట్టుకున్న భార్యను కసితీరా గొంతుకోసి.. కర్నూలులో దారుణం


భర్త ఆవారా..

ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామానికి చెందిన స్వాతి(35)కి మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామానికి చెందిన నరసింహారెడ్డికి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టించుకోకుండా పనీపాటా లేకుండా తిరుగుతుండడంతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఎంతకాలం చూసినా భర్తలో మార్పు రాకపోవడంతో పిల్లలను తీసుకుని భార్య స్వాతి పుట్టిన ఊరు కడివెళ్ల చేరింది.


Also Read: విద్యార్థినిని ఇంట్లో బంధించి అత్యాచారం.. తూర్పు గోదావరిలో కీచక వార్డెన్

కక్ష పెంచుకున్న భర్త..

కూలీ పనులకు వెళ్తూ తన ఇద్దరు బిడ్డలను చదివించుకుంటోంది. అయితే తనను వదిలేసిందని భార్యపై కోపం పెంచుకున్న నరసింహారెడ్డి నాలుగు రోజుల క్రితం కడివెళ్ల వచ్చాడు. మూడు రోజులు భాగానే ఉన్నాడు. అదనుచూసి భార్యను హతమార్చాడు. కూరగాయలు కోసే కత్తితో భార్య స్వాతి గొంతుకోసి కిరాతకంగా చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.


Read Also: మనవరాలిని చంపేసిన తాతయ్య, నానమ్మ.. విజయవాడలో దారుణం

లాడ్జిలో ఆత్మహత్య..

ముందుగా అనుకున్న ప్రకారం.. నరసింహారెడ్డి ఎమ్మిగనూరు చేరాడు. అక్కడ ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఉరేసుకుని చనిపోయాడు. లాడ్జి గదిలో ఫ్యాన్‌కు పంచెతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం రూమ్‌లో నుంచి రక్తం బయటకు రావడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు.


Also Read: కొడుకును చంపేస్తూ జోలపాట.. ముగ్గురు బిడ్డలను రాక్షసంగా హతమార్చిన తల్లి

అనాథలైన పిల్లలు..

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలకొట్టి లోపలికి ప్రవేశించగా నరసింహారెడ్డి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. ప్లాన్ ప్రకారమే భార్యను చంపి తాను ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్యను దారుణంగా హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.